Singer Suchitra: సినీ ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన సింగర్ సుచిత్ర 2016లో ‘సుచీ లీక్స్’ పేరుతో తమిళ సినీ ఇండస్ట్రీలో పెను తుఫాను సృష్టించింది.
అందులో నటుడు ధనుష్, మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, రానా, త్రిష, ఆండ్రియా వంటి సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి రచ్చ రంబోలా చేసింది.
ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు ధనుష్తో పాటు ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్పై తీవ్ర ఆరోపణలు చేసింది.
తన మాజీ భర్త కార్తీక్, ధనుష్కు ఓ గ్రూప్ ఉందని.. వారు తరచూ విజయ్ యేసుదాస్ ఇంట్లో కలిసే వారని తెలిపింది.
ఓ రోజు ధనుష్, డైరెక్టర్ జవహర్ ఫోన్ నుంచి కార్తీక్ మొబైల్కు ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు వచ్చాయని తెలిపింది.
అప్పుడే సుచీ లిక్స్ వ్యవహారం మొదలైందని పేర్కొంది. తన అకౌంట్ ద్వారా ఆ ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేశారని చెప్పింది.
ఈ వ్యవహారం తర్వాతే తన భర్త కార్తీక్ నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలిపింది.
తన మాజీ భర్త కార్తిక్తో సహా ధనుష్ కూడా గే అని ఆరోపించింది. ధనుష్ గే కావడం వల్లే తన భార్యకు విడాకులు ఇచ్చాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఐశ్వర్య రజినీకాంత్కు పెళ్లికి ముందే వేరొక వ్యక్తితో ఎఫైర్ ఉందని తెలిపింది. అట్లాగే ధనుష్ కూడా చాలా మందితో శారీరక సంబంధాలు కొనసాగించాడని పేర్కొంది.