పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్త గణేషునిపాడు గ్రామంలో సోమవారం గొడవ జరగడంతో వైసీపీ నేతలు ఊరు వదిలి పారిపోయారు. వారిని తిరిగి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తీసుకొని వచ్చారు. విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు మరోసారి దాడికి దిగడంతో నేతలంతా పొలాల వెంట పరుగులు తీశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. అక్కడే ఉన్న కాసు మహేశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్పై దాడి చేశాయి టీడీపీ శ్రేణులు. దీంతో పరిస్థితిన చక్కబెట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పుల జరిపారు.
పల్నాడు జిల్లా కొత్త గణేశుని పాడు గ్రామంలో ఉద్రిక్తత.
గాల్లో పోలీసుల కాల్పులు
నిన్న ఎలక్షన్ సందర్భంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం కొత్త గణేశుని పాడు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం వల్ల గ్రామానికి సంబంధించిన మగవారు మొత్తం ఊరు వదిలిపెట్టి పోగా… pic.twitter.com/3HcHiWRcx5
— BIG TV Breaking News (@bigtvtelugu) May 14, 2024