రేడియోలో ఆర్జేగా పనిచేసిన సుచిత్ర 2002లో లేసా లేసా అనే సినిమాతో ప్లేబ్యాక్ సింగర్గా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత మన్మధన్, కాక్క కాక్క, జేజే, వల్లవన్, పోకిరి, పొల్లాదవన్ వంటి ఆమె పాడిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దానికి ప్రధాన కారణం సుచిత్ర మాగ్నెటిక్ వాయిస్. అయితే ఆమె గాయకురాలే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.
తిర్తుప్పయలేలో మాళవికకు, కందస్వామిలో శ్రేయకు, మంగాథలో లక్ష్మీరాయ్కి సుచిత్ర డబ్బింగ్ చెప్పారు. అంతేకాకుండా ఆమె జే జే, ఆయుధ చిషో, బలే పాండ్యా వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన సుచిత్ర గతేడాది 2016లో ‘సుచీ లీక్స్’ పేరుతో తమిళ సినీ ఇండస్ట్రీలో పెను తుఫాను సృష్టించింది. అందులో నటుడు ధనుష్, మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, రానా, త్రిష, ఆండ్రియా వంటి ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు కూడా లీక్ చేసి రచ్చ రంబోలా చేసింది
ఆ తర్వాత అడ్రస్ తెలియకుండానే అదృశ్యమైన సుచిత్ర 2020లో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ నాలుగో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా పాల్గొంది. తదనంతరం బిగ్ బాస్ షో విమర్శకురాలిగా పనిచేస్తున్న సుచిత్ర ఇటీవలి ఇంటర్వ్యూలో తన మాజీ భర్త కార్తీక్, నటుడు ధనుష్తో పాటు ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్పై తీవ్ర ఆరోపణలు చేసింది.
Also Read: హైప్ పెంచేస్తున్న ‘రామాయణం’.. బడ్జెట్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇందులో భాగంగా ముందుగా తన మాజీ భర్త కార్తీక్ కుమార్ గురించి మాట్లాడుతూ.. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘సుచీ లిక్స్’ పేరుతో ప్రైవేటు ఫొటోలు, వీడియోలు లీక్ కావడం వెనుక ధనుష్తో పాటు కార్తీక్ హస్తం ఉందని తెలిపింది. కార్తీక్, ధనుష్కు ఓ గ్రూప్ ఉందని.. వారు తరచూ విజయ్ యేసుదాస్ ఇంట్లో కలిసే వారని తెలిపింది. అయితే ఓ రోజు ఎర్లీ మార్నింగ్ ధనుష్, డైరెక్టర్ జవహర్ ఫోన్ నుంచి కార్తీక్ మొబైల్కు ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు వచ్చాయని తెలిపింది.
అయితే అప్పుడే సుచీ లిక్స్ వ్యవహారం మొదలైందని పేర్కొంది. కాగా తన అకౌంట్ ద్వారా ఆ ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేశారని చెప్పింది. ఈ వ్యవహారం తర్వాతే తన భర్త కార్తీక్ నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా మరో షాకింగ్ కామెంట్ చేసింది. తన మాజీ భర్త కార్తిక్తో సహా ధనుష్ కూడా గే అని ఆరోపించింది. ధనుష్ గే కావడం వల్లే తన భార్యకు విడాకులు ఇచ్చాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే ఈ ఇంటర్వ్యూలో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ను కూడా ఇన్వాల్వ్ చేసింది. ఐశ్వర్య రజినీకాంత్కు పెళ్లికి ముందే వేరొక వ్యక్తితో ఎఫైర్ ఉందని తెలిపింది. అట్లాగే ధనుష్ కూడా చాలా మందితో శారీరక సంబంధాలు కొనసాగించాడని పేర్కొంది. ప్రస్తుతం ఆమె షాకింగ్ వ్యాఖ్యలు ఇంటర్నెట్లో సంచలనంగా మారాయి. మరి వీటిపై ధనుష్, ఐశ్వర్యరజినీకాంత్లు స్పందిస్తారో లేదో చూడాలి.