Indigo Flight Stuck in Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం నిలిచిపోయింది. మంగళవారం ఇండిగో విమానం 6ఏ6707 హైదరాబాద్ నుంచి బయలు దేరాల్సి ఉంది. అయితే టేకాఫ్ సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రన్ వే పైనే నిలిచిపోయింది. గంటపాటు టేకాఫ్ కాకుండా రన్ వేపై నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
Also Read: హైదరాబాద్తో సహా ఆ జిల్లాల్లో వర్షం పడొచ్చు..? ఎప్పుడంటే..?
శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొచ్చిన్ వేళ్లాల్సిన విమానం నిలిచిపోయింది. అయితే ఈ విమానంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్, శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. గంట సమయం పాటు విమానం టేకాఫ్ అవకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ లైన్ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.