AP Lok Sabha Elections 2024: ఏపీ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు జనం పోటెత్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా అనేక పోలింగ్ బూత్ లతో ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల హింసాత్మక దాడులు జరిగినా వాటిని పట్టించుకోకుండా ఓటర్లు ఓటు వేస్తున్నారు.
సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఈసీ కూడా వారికి అవకాశం కల్పించింది. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదయింది.ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుందని సీఈవో తెలిపారు. రాత్రి 10 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కురుపాం, పాలకొండ, సాలూరులో 5 గంటలకు ముగిసింది. 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా కొన్ని ప్రాంతాల్లో జనం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వారందరికీ ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
Also Read: ఏపీలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది: ఎంకే మీనా
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న పోలింగ్
సుమారు 40 పోలింగ్ బూత్ లలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో వేచి ఉన్న ఓటర్లు. కొన్ని బూత్ లలో రాత్రి 10 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.#APElections2024 #AndhraPadesh #Votingday #NewsUpdates… pic.twitter.com/IPBiomD44p
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024