Lok Sabha Polling has Ended in Telangana: తెలంగాణలో పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్, మంథని, ములుగు, భూపాలపల్లి, భద్రాచలం, మంచిర్యాల, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మిగిలిన 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.
కాగా, సాయంత్రం 6 గంటల లోపు లైన్లలో నిల్చున్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.