Ap Assembly Elections Highlights: పల్నాడు జిల్లా నరసరావు పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. వైసీపీ నేతలు ఓటర్లపై దాడులకు పాల్పడటంతో పాటు..టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు కారుపై దాడి చేశారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో వైసీపీ నేతలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. దాడిని టీడీపీ వర్గీయులు తిప్పికొట్టారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టగా.. అక్కడకు చేరుకున్న పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించి రెండు వర్గాలను చెదరగొట్టారు.
గుంటూరు: నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు. రబ్బరు బెల్లెట్లు ప్రయోగిస్తున్న పోలీసులు.#APElections2024 #AndhraPradesh #Guntur #NewsUpdates #bigtvlive@YSRCParty @JaiTDP pic.twitter.com/uIzIXfx0Zu
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024
Also Read: MK Meena on polling percentage: పోలింగ్ శాతం పెరిగిందన్న మీనా, అది పాజిటివ్ అన్న వైసీపీ
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరువురు పరస్పర దాడులకు పాల్పడ్డారు. వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే మేరిగ మురళిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
తిరుపతి: గూడూరు నియోజకవర్గం చిల్లకూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తలెత్తిన వివాదం.. పరస్పర దాడులు. వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ మేరిగ మురళిపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు.#APElections2024 #Tirupati #TDP #YSRCP #NewsUpdates #bigtv@YSRCParty @JaiTDP pic.twitter.com/ORSDurXtvk
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో గోకర్ణపల్లిలో ఉద్రికత నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో అధికారులు భారీగా సెంట్రల్ ఫోర్స్ ను రంగంలోకి దించారు . జనరల్ ఏజెంట్ గా పోలింగ్ కేంద్రంలో స్పీకర్ సతీమణి తమ్మినేని వాణి ఉండగా.. ఆమెను బయటకు పంపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
Also Read: Attack On Chandragiri MLA Candidate: చంద్రగిరిలో హైటెన్షన్.. కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం గోకర్ణపల్లిలో ఉద్రిక్తత వాతావరణం. ఇరువర్గాల మధ్య కొట్లాటతో ఇద్దరికి గాయాలు. భారీగా సెంట్రల్ ఫోర్స్ ని మోహరించిన అధికారులు.
జనరల్ ఏజెంట్ గా పోలింగ్ కేంద్రంలో బైటాయించిన స్పీకర్ సతీమణి తమ్మినేని వాణి. వాణిని బయటకు పంపించాలని డిమాండ్ చేసిన… pic.twitter.com/r3MSgACZFx— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024