Lok Sabha Elections 2024: బిహార్ గురుద్వారలో ప్రధాని మోదీ సేవ చేశారు. భక్తులకు లంగర్ ను స్వయంగా వడ్డించారు. బిహార్ లో మోదీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాట్నాలోని తాకత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్ గురుద్వారను సందర్శించుకున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ప్రధాని మోదీ పాట్నాలోని తాఖత్ శ్రీ హరిమందిన్ జీ పట్నా సాహిబ్ ను దర్శించుకున్నారు. గురుద్వారలో ఆయన సేవ చేశారు. అనంతరం వంటశాలకు వెళ్లి రోటీలు తయారు చేసి.. గరిట తిప్పారు. ఆయనే స్వయంగా అక్కడకు వచ్చిన భక్తులకు వడ్డించారు. మోదీ రాక సందర్భంగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
18 శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ తాకత్ శ్రీ హరిమందిన్ జీ పట్నా సాహిబ్ గురుద్వారను నిర్మించారు. గురుగోబింద్ పుట్టిన ఊరు ఇదే. ఈయన సిక్కు గురువుల్లో పదవ వ్యక్తి అని చెబుతారు. పాట్నాలో 1966 లో గురు గోబింద్ జన్మించారు. ఆయన తొలి రోజులు ఇక్కడే గడిపారు. తర్వాత ఆనంద్ సాహిబ్ కు వెళ్లారు.
Also Read: ఈ నెల 14న మోదీ నామినేషన్.. భారీగా నేతల ఏర్పాట్లు
ఆదివారం బిహార్ చేరుకున్న ప్రధాని నిన్న రాత్రి పాట్నాలో రోడ్ షో నిర్వహించారు. బీహార్ లో రోడ్ షో నిర్వహించిన మొదటి ప్రధాని.. మోదీ కావడం విశేషం. ఈ రోజు కూడా మోదీ పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మజీపుర్, ముజఫర్ పుర్, సరష్ జిల్లాలో ఎన్డీయె అభ్యర్థుల తరపున ప్రచారం చేయన్నారు. ఇక ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి పోటీ చేయనున్న మోదీ మంగళవారం ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూన్ 1 న వారణాసిలో పోలింగ్ జరగనుంది.
#WATCH | PM Narendra Modi serves langar at Gurudwara Patna Sahib in Patna, Bihar pic.twitter.com/FWBdcj40Fe
— ANI (@ANI) May 13, 2024