High Tension at Tadipatri Poling Booth, YSRCP Vs TDP Stone Pelting: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం రణరంగంగా మారింది.
వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పోలింగ్ బూత్కు ఒకేసారి వచ్చారు. దీంతో నేతల మద్దతుదారులు, పార్టీల కార్యకర్తలు రోడ్డుపైనే ఎదురెదురుగా తిష్టవేశారు.
ఈక్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. వాహనాలు ధ్వంసం చేసుకున్నారు. ఆ తర్వాత రాళ్లు రువ్వుకున్నారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. చివరకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో వాళ్లపైకి రాళ్లురువ్వారు.
Also Read: పల్నాడులో వైసీపీ కేడర్ దాడులు, ఎంపీ అభ్యర్థి కాన్వాయ్పై దాడి
పరిస్థితి గమనించిన పోలీసులు భయంతో బెంబేలెత్తిపోయారు. చివరకు కేంద్ర బలగాలు రావడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. స్థానిక పోలీసులు నేతలతో మాట్లాడారు. చివరకు ముఖ్యనేతలు ఇళ్లకు చేరుకున్నారు. ఘటనను పరిశీలించిన అధికారులు భారీ ఎత్తున తాడిపత్రి టౌన్లో భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దింపాయి.
తాడిపత్రి వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎస్పీ వాహనంపై దాడి చేయడమే కాకుండా టీడీపీ అభ్యర్థి అస్మిత్రెడ్డిపై దాడికి దిగడం దారుణమన్నారు. వైసీపీ హింసా రాజకీయాల పరాకాష్టకు ఇదే నిదర్శనమన్నారు. ఐదేళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు తమ దాడులతో ప్రజల్లో భయం కలిగించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రను ప్రజలే తిప్పికొట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా పోలింగ్ కేంద్రాలకు వద్దకు వచ్చి ఓటు వేయాలని పిలుపు నిచ్చారు.
Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై
అంతకుముందు తాడిపత్రి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయకుంటే నరుకుతానని బెదిరించారు. ఈలోగా టీడీపీ దీపక్రెడ్డి అక్కడే ఉన్నారు. ఇరువురు నేతలకు సర్ది చెప్పి పంపించారు. ఈ విషయంలో పోలీసులు సైలెంట్గా ఉండడాన్ని దీపక్రెడ్డి తప్పుబట్టారు. ఆ తర్వాత ఇరువర్గాల కేడర్ను పోలీసులు చెదరగొట్టారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకేసారి పోలింగ్ బూత్ వద్దకు రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు. రోడ్డుపైనే ఎదురెదురుగా తిష్ట వేసిన నాయకులు.. వాళ్ల అనుచరులు.#APElections2024 #AndhraPradesh #Anantapuram #YRSCP #TDP… pic.twitter.com/i6rGDDGyOP
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024
నేటి పోలింగ్ లో వైసీపీ హింస ఎంతవరకు వెళ్లిందంటే… కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే దాడి చేయడం… తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి పై దాడికి దిగడం, వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట. జగన్ 5ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ… pic.twitter.com/h20Rh8Jv8f
— N Chandrababu Naidu (@ncbn) May 13, 2024