Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లోని నందినగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ తెచ్చిన నాయకుడికి ఓటు వేసానని మీరు కూడా ఓటు వేయాలని సూచించారు. పరోక్షంగా బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కేటీఆర్ చెప్పడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఓటు రాజ్యంగం కల్పించిన హక్కు అని ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మన బాధ్యత సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు.
Also Read: తెలంగాణలో పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
తెలంగాణ తెచ్చిన నాయకుడికి ఓటు వేయమని ఓటర్లకు సూచిస్తున్న కేటీఆర్. హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్.#LoksabhaElections2024 #ElectionDay #Telangana #BRS #KTR #NewsUpdates #bigtvlive @CEO_Telangana @BRSparty pic.twitter.com/YtF5f3bMtz
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024