YCP Candidate Manhandling to Voter: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొందరగా ఓటు వేసి ఇంటికి వెళ్లిపోయాలని నిర్ణయించుకున్నారు ఓటర్లు. అయితే పోలింగ్ కేంద్రంలో దౌర్జన్యం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి. అంతేకాదు ఓటరు చెంప చెళ్లుమనిపించారు కూడా.
తాజాగా వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ క్యూలైన్లో వెళ్లకుండా నేరుగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. ఆయన వెళ్లడం గమనించిన ఓటరు.. అభ్యంతరం వ్యక్తంచేశారు. పట్టరాని కోపంతో ఆయనపైకి దూసుకెళ్లారు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. అంతటితో ఆగకుండా ఓటరు చెంప చెళ్లుమనిపించారు.
అది చూసి షాకైన ఓటరు, ఆయనపైకి ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో అభ్యర్థి అనుచరులు ఓటరుని పోలింగ్ స్టేషన్ వద్దు చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
Also Read: 9 గంటలకు పోలింగ్.. ఓటు వేసిన కేఏపాల్, సంచలన వ్యాఖ్యలు
మరోవైపు హిందూపురంలోని చలమతూర్ మండలం హుసేన్పురం గ్రామంలో టీడీపీ నాయకుడు బాబురెడ్డి పై వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో తెలియక కొంతమంది ఓటర్లు భయంతో పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వాళ్లని చెదరగొట్టారు. సరైన సమయంలో పోలీసులు వచ్చారని లేకుంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు స్థానికులు.
గుంటూరు జిల్లా తెనాలిలో ఓటర్ ని కొట్టిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్. తిరిగి ఎమ్మెల్యేని కొట్టిన ఓటర్. ఎమ్మెల్యే క్యూలో కాకుండా నేరుగా ఓటు వేయటానికి వెళ్లడంతో అభ్యంతర చెప్పిన ఓటర్.#APElections2024 #AndhraPradesh #Guntur #YSRCP #MLAannabattunisivakumar #NewsUpdates… pic.twitter.com/ntSjBpSYOp
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024
Also Read: Chandrababu pawan in Varanasi: వారణాసిలో బాబు, పవన్, ఎన్డీయే నేతలతో భేటీ
అమరావతి :
హిందూపురం లోని చలమతూర్ మండలం హుసేన్ పురం గ్రామంలో టిడిపి నాయకుడు బాబు రెడ్డి పై వైసీపీ నాయకులు దాడి.#APElection2024 #ElectionDay #Voted #PollingDay #YSRCP #tdp #politics #bigtvlive@YSRCParty @JaiTDP pic.twitter.com/w2FShHLe5E
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024