KA Paul Vote in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వాతావరణం కాస్త చల్లగా ఉండడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఏపీలో ఉదయం 9 గంటలకు 9.01 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
కడపలో అత్యధికంగా, గుంటూరులో అత్యల్పంగా పోలింగ్ నమోదు అయినట్టు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 9.27 శాతం, మంగళగిరిలో 5.25శాతం, పిఠాపురంలో 10, పులివెందులలో 12.44 శాతం పోలింగ్ నమోదు అయినట్టు అధికారులు వివరించారు.
విశాఖ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కేఏ పాల్. కేంద్రాల వద్ద ఓటర్లను చూసి ఆయన ఉబ్బితబ్బిబయ్యారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే ప్రజాస్వామ్యంలో ఇదే చివరి ఎన్నికలని కొందరు అంటున్నారని తెలిపారు కేఏపాల్. యూత్, చదువుకున్నవారు అధికంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చినట్టు చెప్పుకొచ్చారు.
Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై
రండి.. మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు. నచ్చినవారికి వేయాలని చెబుతూనే క్రిమినల్స్కు ఓటు వేయవద్దని మనసులోని మాట బయటపెట్టారు కేఏ పాల్. విశాఖ ఎంపీ, గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది.
మార్పు కావాలంటే ఆలోచించి ఓటు వేయండి..కె ఎ పాల్
ఓటు హక్కు వినియోగించుకున్న
కె ఎ పాల్#kapaul #ElectionDay #Voted #APElections2024 #Polling #NewsUpdate #bigtvlive pic.twitter.com/5rRSa0POjK— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024