Balakrishna, Pawan Kalyan Family Vote: ఆంధప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు తమతమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ దంపతులు హిందూపురం మున్సిపాలిటీ ఆర్టీసీ కాలనీ మూడో వార్డులోని 42వ బూత్లో ఓటు వినియోగించుకున్నారు. బాలకృష్ణ దంపతులు పోలింగ్ కేంద్రానికి వచ్చే సమయంలో నందమూరి అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వాళ్లంతా వెనుదిరిగారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓటు వేశారు. లక్మీనరసింహస్వామి కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి భార్య అన్నాలెజినోవాతో కలిసి జనసేనాని వచ్చారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ వద్ద కాస్త తోపులాట జరిగింది. పవన్ చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓటర్లను అదుపు చేయడం కాస్త ఇబ్బందిగా మారింది.
Also Read: AP: బారులు తీరిన ఓటర్లు.. అర్ధరాత్రి 12 గంటలు దాటినా..
Chief @PawanKalyan garu at polling booth along with his wife #CastYourVote #APElection2024#Elections2024pic.twitter.com/qrVMzax7ao
— శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 (@JSPSriram) May 13, 2024
#NandamuriBalakrishna along with Vasundhara Devi garu casted their votes in Hindupur.#APElections2024 pic.twitter.com/iP2XhTC7xH
— Nandamurifans.com (@Nandamurifans) May 13, 2024
మంగళగిరి లోని గిరిజన సహకార సంస్థ పోలింగ్ కేంద్రంలో సతీమణి శ్రీమతి అన్నా లెజినోవా గారితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#CastYourVote #Elections2024 #APElection2024 pic.twitter.com/CObFnBmrDO
— JanaSena Shatagni (@JSPShatagniTeam) May 13, 2024