PM Modi and Amit Shah Call to AP Voters: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభకు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు పిలుపునిచ్చారు.
ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగులో పాల్గొవాలని పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటు వేసేవారు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్లు తన ట్వీట్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు కేంద్రమంత్రి అమిత్ షా కూడా తనదైన శైలిలో ట్వీట్ చేశారు. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. రాష్ట్రాన్ని మతమార్పిడి, అవినీతి, దుష్పరిపాలన నుండి విముక్తి చేయాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు అమిత్ షా.
Also Read: ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్ ఫ్యామిలీలు, విజయంపై ధీమా
అటు తెలంగాణపై మరో ట్వీట్ చేశారు అమిత్ షా. రాష్ట్ర సంస్కృతిని, గౌరవాన్ని పెంపొందించాలన్నారు. సుపరిపాలనను కొనసాగించి, వ్యవసాయ రంగంలో ఆర్థిక బలాన్ని నింపాలని కోరారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై శ్రద్ధ వహించి, బుజ్జగింపులు, అవినీతిని అంతం చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. అభివృద్ధి, సమాన అవకాశాలను అందించడం ద్వారా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు అధిక లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను.
ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను .— Narendra Modi (@narendramodi) May 13, 2024
Also Read: PM Modi nomination: వారణాసిలో మోదీ నామినేషన్, మెజార్టీపైనే ఫోకస్
లోక్ సభ ఎన్నికల నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరగనుంది. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించి, ప్రోత్సహించి, రాష్ట్రాన్ని మతమార్పిడి, అవినీతి, దుష్పరిపాలన పంజాల నుండి విముక్తి చేసి, ఎస్సీ, ఎస్టీలు మరియు ఓబీసీల అభ్యున్నతి…
— Amit Shah (@AmitShah) May 13, 2024
తెలంగాణలో నేడు నాలుగో దశ పోలింగ్ జరగనుంది. రాష్ట్ర సంస్కృతిని, గౌరవాన్ని పెంపొందించి, సుపరిపాలనను కొనసాగించి, వ్యవసాయ రంగంలో ఆర్థిక బలాన్ని నింపి, రైతుల సమస్యలపై శ్రద్ధ వహించి, బుజ్జగింపులు మరియు అవినీతిని అంతం చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను.…
— Amit Shah (@AmitShah) May 13, 2024