CM Jagan, Chandrababu Lokesh Families: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాకరాపురంలోని పోలింగ్ కేంద్రం వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు సీఎం జగన్.
అనంతరం మాట్లాడిన సీఎం జగన్, ఐదేళ్లగా తమ ప్రభుత్వ పాలన నచ్చితేనే ప్రజలు ఓటు వేయాలన్నారు. లబ్ది పొందామని భావిస్తేనే భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కోరారు.
అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు చంద్రబాబు దంపతులు. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన సతీమణి బ్రహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై
ఓటు వేసిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓట్ల విషయంలో జనం చూపిస్తున్న చొరవ మరువలేనిదన్నారు. ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి అంటూనే, భవిష్యత్తును తీర్చిదిద్దేవని గుర్తు చేశారు. ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని, భవిష్యత్తుకు పునాదులు వేస్తుందన్నారు.
పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో వైసీపీ దాడులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.
Also Read: Elections in AP: చంద్రబాబు ఆగ్రహం.. మీరే తిప్పి కొట్టాలంటూ..
పులివెందులలో ఓటు వేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి#APElections2024 #AndhraPradesh #Pulivendula #Ysrcp #YsJagan #NewsUpdates #bigtvlive pic.twitter.com/u4cJgjyioz
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024
కడపలో ఓటు వేసిన వైఎస్ భారతి#APElections2024 #AndhraPradesh #Kadapa #YSRCP #YSBharathi #NewsUpdates #bigtvlive pic.twitter.com/3qZEDWrMdb
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024
Also Read: AP: బారులు తీరిన ఓటర్లు.. అర్ధరాత్రి 12 గంటలు దాటినా..
కుప్పంలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు, మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న నారా లోకేష్ దంపతులు#APElections2024 #AndhraPradesh #Kuppam #Mangalagiri #TDP #ChandrababuNaidu #NaraLokesh #NewsUpdates #bigtvlive pic.twitter.com/YS88pe7I1E
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024
#WATCH | Guntur: After casting his vote, Former Andhra Pradesh CM and TDP chief N Chandrababu Naidu says, "I have never seen such a crowd during my political career. People have come from America, Bengaluru, Chennai to cast their votes… People want to protect democracy and… pic.twitter.com/ab6GZu5GJz
— ANI (@ANI) May 13, 2024