Attack on TDP Polling Agent: ఎన్నికల వేళ ఆంధ్రలో విభేదాలు భగ్గుమన్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభమవనుండగా అధికార, ప్రతిపక్షాలు తాడో పేడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. అయితే రాష్ట్రంలో అక్కడక్కడ టీడీపీ వైసీపీ సిబ్బందికి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.
తాజాగా మచిలీపట్నంలో సర్కారుతోటలోని 46వ పోలింగ్ బూత్లో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ పోలింగ్ ఏజెంట్ రత్నాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలింగ్ బూత్లోకి వెళ్లి పోలింగ్ ఏజెంట్గా సంతకం చేయడానికి వెళ్లిన రత్నాకర్పై కొందరు గుర్తు తెలియని వైసీపీ వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు.
టీడీపీ పోలింగ్ ఏజెంట్ పై వైసీపీ నేతల దాడి..
మచిలీపట్నంలో సర్కారుతోటలోని 46వ పోలింగ్ బూత్ లో ఘటన. దాడిలో గాయపడ్డ పోలింగ్ ఏజెంట్ రత్నాకర్. పోలింగ్ ఏజెంట్ గా సంతకం చేసేందుకు వెళ్లిన రత్నాకర్ పై దాడి చేసిన కొంత మంది వైసీపీ కార్యకర్తలు. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట. ఘటనా… pic.twitter.com/Xt38QI0JoI
— BIG TV Breaking News (@bigtvtelugu) May 12, 2024