CM Revanth Reddy to visits Kodangal Today: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ కు వెళ్లనున్నారు. నేడు, రేపు రెండు రోజులపాటు ఆయన కొడంగల్ లోనే ఉంటారని సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయన కొడంగల్ కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సతీసమేతంగా సీఎం దంపతులు కొడంగల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గత రెండు నెలలుగా ప్రజల మధ్యే ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారంతో ముగింపు పలికారు.
Also Read: విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి
అయితే, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన నేతలకు రెస్ట్ దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి, అక్కడ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడుతూ అందరి దృష్టిని ఆకర్శించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.