Telangana CM Revanth Reddy Plays Foot ball: గొత కొన్ని రోజులుగా నిత్యం ఎన్నికల ప్రచారంతో బిజీబిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడి రిలాక్స్ అయ్యారు. ఆదివారం ఉదయం ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు. ఆ సమయంలో ఆయన ఉత్సాహంగా కనిపించారు. ఆటలో గోల్ వేసేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో షూ పాడైపోతే వాటిని తీసేసి ఆటను కొనసాగించారు. ఏమాత్రం తగ్గకుండా విద్యార్థుల వెంట పరుగులు తీస్తూ ఫుల్ జోష్ తో ఫుట్ బాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. రేవంత్ ఆటను చూసిన పలువురు సూపర్.. బాగా ఆడారు అంటూ అభినందిస్తున్నారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తోపాటు యూనివర్సిటీ విద్యార్థులు, పలువురు నేతలు కూడా ఆటలో పాల్గొన్నారు.
Also Read: KA Paul vote in Visakhapatnam: 9 గంటలకు పోలింగ్.. ఓటు వేసిన కేఏపాల్, సంచలన వ్యాఖ్యలు