IT Raids : హైదరాబాద్ లో ఐటీ, ఈడీ దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో తరచూ సోదాలు జరుగుతున్నాయి. తాజాగా ఐటీశాఖ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్రెడ్డి డైరెక్టర్గా ఉన్నారు.
మంత్రి మల్లారెడ్డి, కుమారుడు, అల్లుడు ఉంటున్న కొంపల్లిలోని ఫామ్ మెడోస్ విల్లాలోనూ తనిఖీలు చేపట్టారు. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో మంత్రి మల్లారెడ్డి కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నాయి.