Vaarasudu : దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఇది పేరుకే ద్వి భాషా చిత్రమైనప్పటికీ తమిళంలోనే షూట్ చేసి తెలుగులోకి అనువదిస్తున్నారనటంలో సందేహం లేదు. దీంతో తెలుగు నిర్మాతల మండలి ‘వారసుడు’ చిత్రాన్ని డబ్బింగ్ సినిమాగానే భావించి సంక్రాంతికి థియేటర్స్ ఇవ్వలేమంటూ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు వారసుడు సినిమా విషయంలో మన నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయంపై తమిళ నిర్మాతల మండలి సీరియస్ అవుతుందట. తెలుగు చిత్రాలను కోలీవుడ్ ఆదరిస్తుంటే.. తమిళ చిత్రాలకు టాలీవుడ్ అడ్డంకులు క్రియేట్ చేయటం సరికాదని వారు భావిస్తున్నారు. ఈ విషయంపై నవంబర్ 22న తమిళ నిర్మాతల మండలి చర్చ జరపనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వారసుడు వివాదం చివరకు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
దళపతి విజయ్ సినిమాలు తెలుగులో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దిల్ రాజు.. ఆయనతో భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది.