Chandrababu Letter to AP CS Jawahar Reddy on Pensions: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి బహిరంగ లేఖ రాసారు. పెన్షన్ దారుల ఇబ్బందుల గురించి లేఖలో ప్రస్తావించారు. పెన్షన్ కోసం లబ్ధిదారులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తుండటంతో దీనిపై చంద్రబాబు స్పందించారు. పేదల ప్రాణాలతో రాజకీయం చేయడం ఏంటని సీఎస్ ను ప్రశ్నించారు. పెన్షనర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు.
ఎన్నికలకు ముందు పెన్షన్ దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. పెన్షన్ పంపిణీ సకాలంలో జరిగాలని ఎన్నికల కమిషన్ గతంలోనే సూచించినా.. ఉత్తర్వులను పట్టించుకోకుండా సచివాలయాల దగ్గర జనం బారులు తీరేలా చేశారని అన్నారు. అంతే కాకుండా 33 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని తెలిపారు.
Also Read: మరి జగన్.. మోదీ సైతం చట్టాలను వెనక్కి తీసుకోలేదా?
ఈ నెల కూడా పెన్షన్ దారులను ఎండలో తిరిగేలా చేసి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. పెన్షన్ డబ్బలు బ్యాంకుల్లో జమ చేయడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మండు టెండల్లో లబ్ధిదారులు రోడ్లపై తిరగాల్సి వస్తుందని తెలిపారు. గత నెలలో ఎండలో సచివాలయాల చుట్టూ తిప్పారని.. ఇప్పడు మళ్లీ బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.