t20: మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మళ్లీ చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ తో రెండో టీ20లో వీర బాదుడు బాదేశాడు. 49 బంతుల్లో సెంచరీ చేసేశాడు. 6 సిక్సులు, 10 ఫోర్లతో.. కివిస్ సేనకు చుక్కలు చూపించాడు. బాల్ ఎక్కడ వేసినా.. ఫోరో, సిక్సరో పక్కా. 51 బంతుల్లో 111 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు మనోడు. ఇంటర్నేషనల్ టీ20లో సూర్యకుమార్ కు ఇది రెండో సెంచరీ.
సూర్య రాణించడంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. చివరి ఓవర్ లో కేవలం 5 పరుగులే ఇచ్చి.. హ్యాట్రిక్ వికెట్స్ తీశాడు న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథి. ఫెర్గూసన్ రెండు, ఇష్ సోథీ ఒక వికెట్ తీశారు.
ఓపెనర్ గా పంత్(6) మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఇషాన్(36), శ్రేయస్(13), హార్దిక్(13) పరుగులు చేశారు.
మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం అయింది. మిగిలిన రెండు మ్యాచుల్లో ఎవరు గెలిస్తే వారిదే కప్.