Vijaynagaram Bus Accident : విజయనగరం జిల్లా ఎస్.కోట పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ధర్మవరం గ్రామంలో డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో …..ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బాలుడ్ని ఢీకొట్టింది. అంతటితో ఆగలేదు. పక్కనే ఉన్న ఇంట్లోకి బస్సు దూసుకుపోయింది. తీవ్రగాయాలపాలైన బాలుడు…ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు విడిచాడు. ఇంట్లో ఉన్న మహిళకు తీవ్రగాయాల్యాయి. మృతుడు ఎస్.కోట నారాయణ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న అభిషేక్ గా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయాణీకులు ఉన్నట్లుగా నిర్ధారించారు.