MP Aravind House Attack Case : ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ధర్మపురి అర్వింద్ తప్పుడు ఆరోపణలు చేశారనే ఆగ్రహంతో కొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు.. హైదరాబాద్లోని ఆయన ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్స్, అద్ధాలను ధ్వంసం చేయడంతో పాటు..తమపై దాడి చేసారని అర్వింద్ తల్లి ఫిర్యాదు చేసింది.
ఈ కేసులో తొమ్మిది మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఐతే వారికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది తిరుపతి వర్మ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల తరపున తిరుపతి వర్మ వాదనలు వినిపించారు. నిందితుల తరపు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు…తొమ్మిది మందికి బెయిల్ మంజూరు చేసింది.