Bandi Sanjay Visits Aravind House : ఎంపీ అరవింద్ ఇంటిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించారు. నిన్న అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో ఆయన పరిస్థిని నేరుగా పరిశీలించడానికి అక్కడికి చేరుకున్నారు. ఎంపీ అరవింద్ తల్లి గారిని పరామర్శించారు. ఇంట్లో ధ్వంసమైన వస్తువులను పరిశీలించారు. దాడి ఎప్పుడు, ఎలా జరిగిందనే విషయాలను ఆసమయంలో ఇంట్లో ఉన్నవారిని అడిగి తెలుసుకున్నారు.
ఇంట్లో ఉన్న అరవింద్ తల్లి 70ఏళ్ల వృద్ధురాలని కూడా చూడకుండా భయబ్రాంతులకు గురిచేస్తారా అని మండిపడ్డారు బండి సంజయ్. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, ఇతర మోర్చా నేతలతో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. టీఆర్ఎస్ చేసిన దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలను పిలుపునిచ్చారు. బీజేపీ శ్రేణుల సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని అన్నారు. బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగితే టీఆర్ఎస్ కార్యకర్తలు తట్టుకోలేరని టీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు బండి సంజయ్.