Sandeep Reddy Vanga ‘Animal Park’:‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ మూవీతో యూత్కి బాగా కనెక్ట్ అయిపోయాడు. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దీని తర్వాత వంగా బాలీవుడ్లో ‘యానిమల్’ తెరకెక్కించాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ త్రిప్తి డిమ్రి కీలక పాత్ర పోషించింది.
ఈ మూవీ గతేడాది రిలీజ్ అయి బాక్సాఫీసును షేక్ చేసింది. ఎవరూ ఊహించని కలెక్షన్లను నమోదు చేసి అబ్బుర పరచింది. ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టేసింది. ముఖ్యంగా ఇందులో ఉండే రొమాంటిక్ సీన్లకు యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు. ఇక ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ను అందుకుంది.
దీంతో ఈ మూవీ సీక్వెల్ను కూడా మేకర్స్ ప్రకటించేశారు. ఈ సీక్వెల్ చిత్రాన్ని ‘యానిమల్ పార్క్’ పేరుతో తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అయితే ఈ యానిమల్ పార్క్ గురించి దర్శకుడు వంగా తాజాగా ఓ అప్డేట్ అందించాడు. వంగా ఇటీవల ఒక అవార్డు వేడుకకు హాజరయ్యాడు. అక్కడ అవార్డును అందుకున్న క్రమంలో యానిమల్ మూవీ సీక్వెల్పై కొన్ని అప్డేట్లను పంచుకున్నాడు.
Also Read: వాళ్లు అలా చేస్తే హాలీవుడ్కి వెళ్లి సినిమాలు తీస్తా: సందీప్ రెడ్డి వంగా
‘యానిమల్ పార్క్’ టైటిల్తో తెరకెక్కబోతున్న ఈ సినిమా 2026లో సెట్స్పైకి వెళ్తుందని అన్నాడు. అయితే యానిమల్ మూవీ కంటే యానిమల్ పార్క్ మరింత వైల్డ్గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంతక ముందెన్నడూ లేని విధంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు పేర్కొన్నాడు.
అయితే రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, విజయ్ దేవరకొండ, ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకునే సందీప్ని సినిమాటిక్ యూనివర్స్ గురించి అడగ్గా.. దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదని అతడు చెప్పాడు. అయితే ‘యానిమల్’ మూవీని తమిళ్లో తీస్తే సూర్య బాగా సెట్ అయ్యేవాడని తెలిపాడు. దీంతో అతడి వ్యాఖ్యలకు సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇకపోతే వంగా తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్తో ‘స్పిరిట్’ చేయనున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్తో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు.