Mirzapur Actor Pankaj Tripathi Brother in Law Rakesh Tripathi Dies in Road Accident: ‘మీర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరి సరితా తివారీ, అతడి బావ రాజేష్ తివారీ శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో పంకజ్ త్రిపాఠి బావమరిది రాజేష్ తివారీ అక్కడికక్కడే మరణించాడు. అతడి సోదరి సరితకు తీవ్ర గాయాలయ్యాయి.
ఢిల్లీ-కోల్కతా జాతీయ రహదారి-2లోని నిర్సా బజార్ వద్ద సాయంత్రం 4.30 గంటల సమయంలో దంపతులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే వీరిద్దరినీ ధన్బాద్లోని షాహిద్ నిర్మల్ మహ్తో మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యులు రాకేష్ తివారీ అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. అయితే సరిత పరిస్థితి విషమంగా ఉండటంతో సర్జికల్ ఐసియులో చేర్చారు.
రాజేష్ తివారీ, సరితా తివారీ బీహార్లోని గోపాల్గంజ్ నుండి పశ్చిమ బెంగాల్లోని చిత్తరంజన్కు వెళుతుండగా వారి హై-స్పీడ్ కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. యాక్సిడెంట్ స్పాట్ నుండి వచ్చిన ఫొటోల ప్రకారం.. ఈ హై-స్పీడ్ కారు క్రాష్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నందున కారు ముందు భాగం చాలా దెబ్బతినట్లు కనిపిస్తుంది.
Also Read: OTTలో బ్లాక్ బస్టర్ సిరీస్ సీక్వెల్స్.. స్ట్రీమింగ్కి రెడీ.. ఎందులో అంటే?
రాజేష్, సరిత అపస్మారక స్థితిలో ఉండటంతో.. పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు రాజేష్ మరణించినట్లు ప్రకటించారు. సరిత చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.