9 People Died in Car-Truck Collision in Rajasthan: రాజస్థాన్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు – ట్రక్కు ఢీ కొన్న ఈ ప్రమాదం 9 మంది మృతిచెందారు. జలావర్ – అక్లేరాలోని పచోలాలో నేషనల్ హైవే 52పై ఈ దారుణ ఘటన జరిగింది. సమాచారం అందకున్న పోలీసులు.. ప్రమాద ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో మరణించిన యువకులంతా.. ఎంపీ కల్యాణోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా బగ్రీ కమ్యూనిటీకి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి.. ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: వెస్ట్ బ్యాంక్ గాజాలో ఇజ్రాయెల్ దాడి.. 14 మంది మృతి
రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన మరో రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సహా.. నలుగురు మృతిచెందారు. పోలీసులు మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులు నింబహెరాకు చెందినవారుగా గుర్తించారు. అల్వార్ లో జరిగిన వివాహకార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా.. నేషనల్ హైవే 48పై ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.