Formula E Race In Hyderabad : హైదరాబాద్లో తొలిసారి అంతర్జాతీయ స్థాయి ఫార్ములా రేస్కి.. టోటల్ గ్రౌండ్ సిద్ధమైంది. నేడు ఫార్ములా-ఈ రేస్ ట్రయల్ రన్ జరగనుంది. డిసెంబర్లో సెకండ్ ట్రయల్ రన్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసలు రేస్ ఉండనుంది. లండన్, ప్యారిస్, మొనాకో, బెర్లిన్ నగరాల్లోని రేస్ సర్క్యూట్స్కి ఏమాత్రం తగ్గకుండా హుస్సేన్ సాగర్ దగ్గర రేసింగ్ ట్రాక్ను సిద్ధం చేశారు. EV టెక్నాలజీపై అవగాహన పెంచడానికి ఫార్ములా-ఈ రేసింగ్ ఉపయోగపడుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
ఫార్ములా-ఈ ట్రయల్ రన్ కోసం ఇటలీ నుంచి 14మంది రేసర్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వాళ్లకు సంబంధించిన స్పోర్ట్స్ కార్లూ ల్యాండయ్యాయి. ఈ రేసింగ్ కార్లను ప్రత్యేకంగా దుబాయ్ నుంచి హెవీ డ్యూటీ కారియర్ల ద్వారా కట్టుదిట్టంగా హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేశారు. మొత్తం 11 టీమ్లు పాల్గొనబోయే ఈ రేస్లో ఒక్కో టీమ్లో రెండేసి కార్లు, నలుగురు డ్రైవర్లు ఉంటారు. ఇండియాకు చెందిన 10 మంది ఈ రేస్లో పార్టిసిపేట్ చేస్తారు.
రేస్ కారణంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కుల్ని ఇవాళ్టి నుంచి ఈ నెల 20 వరకు మూసివేశారు. నవంబర్ 21వ తేదీ నుంచి యథావిధిగా పార్కులు తెరుచుకుంటాయి. డిసెంబర్లో జరిగే సెకండ్ ట్రయల్ రన్కి ముందు.. మళ్లీ ట్రాక్ను పునరుద్ధరిస్తారు.
అటు… రేసింగ్ పోటీల కోసం నవంబర్16 నుంచే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగుతల్లి జంక్షన్ల వద్ద ట్రాఫిక్ను డైవర్ట్ చేశారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఫార్ములా ఈ ఛాంపియన్ షిప్ పోటీలతో విశ్వ నగరాల జాబితాలో హైదరాబాద్ చేరబోతోంది.