MP Aravind House Attack Case : ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిలో పాల్గొన్న వారిపై బంజారాహిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. కేసు నమోదయిన వారిలో టీఆర్ఎస్ నేతలు రాజారామ్ యాదవ్, మన్నెగోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్వీ నేత స్వామి ఉన్నారు. అరవింద్ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన కంప్లయింట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
శుక్రవారం హైదరాబాద్లో ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఎంపీ ఇంట్లోకి వెళ్లి విద్వంసం సృష్టించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఉదంతంపై బండిసంజయ్, ఎంపీ అరవింద్ ఘాటుగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగుతే టీఆర్ఎస్ తట్టుకోలేదని బండి సంజయ్ హెచ్చరించారు.