Marri Shashidhar Reddy Joins BJP : మరో సీనియర్ నేత హస్తాన్ని వదిలి కాషాయ గూటికి చేరడానికి రెడీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డికి రూట్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పలువురు బీజేపీ పెద్దలతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో.. బీజేపీ కండువా కప్పుకుంటున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కాని వాటిని తీవ్రంగా ఖండించారు.
కట్ చేస్తే.. గత రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో.. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. డీకే అరుణతో కలిసి వెళ్లిన మర్రి శశిధర్ రెడ్డి.. అమిత్ షాతో భేటీ కావటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక బీజేపీ కండువా కప్పుకోవటమే తరువాయి అని సన్నిహిత వర్గాలంటున్నారు. నేడో, రేపో ఆయన మీడియా ముందుకు వచ్చి.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
గతంలో కాంగ్రెస్లో ఉన్న డీకే అరుణ.. బండి సంజయ్ మర్రి శశిధర్ రెడ్డిని అమిత్షా దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికకు సంబంధించి ఇరు నేతలు చర్చించారు. హైదరాబాద్కు వచ్చి కార్యాకర్తలతో మాట్లాడి.. మర్రి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.