Single Fish Price is 2 Lakh Rupees: చేపలు పట్టే జాలర్లకు కొన్ని సార్లు ఎంత వెతికినా సరైన చేపలు దొరకవు. ఎన్ని చేపలు దొరికినా వాటిలో అద్భుతమైన చేపలు దొరకడం చాలా అరుదు. అదే ఒక్కసారి జాలర్ల చేతికి చిక్కాయంటే చాలు ఏకంగా వేలు, లక్షల్లోనే రేటు పలుకుతుంది. తాజాగా ఏపీలో అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. ఒక మత్స్యకారుడి చేతికి ఏకంగా లక్షల విలువ చేసే చేపలు చిక్కాయి. దీనికి సంబంధించిన ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
సాధారణంగానే పులుస చేపలు అత్యధిక ధర పలుకుతాయి. ఎందుకంటే వాటి రుచి, వాసన అనేది మాంసంప్రియులకు అంత మక్కువ. వేల రూపాయలు ఖర్చు చేసి మరి పులుస చేపలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ పులుస చేపలకు మరో పేరు కూడా ఉంది. వీటినే కచ్చిడీ చేపలు అని కూడా అంటారు.
ఒక్క చేప అంత కొడితే రూ. 300 నుంచి రూ. 500లోపు ఉంటుంది. ఇక సీజన్, చేపలను బట్టి ఇక వేల రూపాయలు ఉంటాయి. కానీ ఏపీలో చేప మాత్రం ఏకంగా లక్షల రూపాయల ధర పలుకుతుంది. పులుస చేపలకు ధర ఎక్కువ ఉంటుందని తెలిసిందే.. కానీ మరీ లక్షల్లో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. అంతర్వేదీ సముద్ర తీరంలో ఓ చేప ఏకంగా రూ. 2 లక్షలు పలికింది. రెండు కచ్చిడి చేపలు కలిపి రూ. 4 లక్షలు పలికింది. దీనిని డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపల్లి పాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో దీనిని వేలం వేశారు. ఏకంగా రెండు చేపలకు రూ. 4 లక్షలు పలకడం హాట్ టాపిక్ గా మారింది. దీనిని కొనుగోలు చేసి తినాలంటే ఇక కోటిశ్వరులకు మాత్రమే సాధ్యం అని అందరూ చర్చించుకుంటున్నారు.