Burglars in Oakland: పని, పాటా లేని కొందరు వ్యక్తులు ఓ గ్రూప్గా ఏర్పడి దొంగతనాలు, షాపులు లూటీ చేయడం మనం చూస్తుంటాము. ఇలాంటివి అమెరికాలో మరీ ఎక్కువ. ఆయా గ్యాంగ్ల దారుణాలకు చాలామంది మరణించారు. ఈ తరహా ఘటనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది విద్యార్థులు చనిపోయారు. తాజాగా ఓక్లాండ్లోని జ్యూవెలరీ షాపులో పట్టపగలు దొంగలుపడ్డారు.
ఐదుగురు వ్యక్తుల గ్యాంగ్.. చైనీష్కు చెందిన జ్యూవెలరీ షాపులోకి చొరబడింది. గన్ చూపిస్తూ ఆ షాపులోకి ఎంట్రీ ఇచ్చారు దొంగలు. బంగారు ఆభరణాలున్న అద్దాలను తమతో తెచ్చుకున్న సుత్తితో పగలకొట్టి ధ్వంసం చేశారు. తమను ఏమీ చేయవద్దని అక్కడే ఉన్న మహిళలు మొరపెట్టుకున్నారు. వాళ్లని ఏమీ చేయకుండా అందులో ఉన్న బంగారాన్ని దొంగలించి వెళ్లిపోయారు.
సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమను వాళ్లు చంపేస్తారని భయపడి దాక్కున్నామని, వాళ్లను ఎదురించే సాహసం తాము చేయలేకపోయామని తెలిపారు. చివరకు మా ప్రాణాలు దక్కించుకున్నామని అందులోని పని చేసిన మహిళలు తెలియజేశారు.
🇺🇸 BURGLARS IN OAKLAND HIT CHINESE JEWELRY STORE IN BROAD DAYLIGHT
The family reported the bandits took around 90% of their inventory in less than a minute, and that insurance won't cover what was lost.
Another store down in Oakland.
Source: @DionLimTV pic.twitter.com/z8zol764At
— Mario Nawfal (@MarioNawfal) April 13, 2024