Navratri 2024: ఏప్రిల్ 9వ తేదీ నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రి సమయంలో దుర్గాదేవి భక్తులు దేవి.. 9 రూపాలను పూజిస్తూ ఉపవాసం పాటిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, దుర్గాదేవిని పూజించడం ద్వారా, కోరికలు నెరవేరుతాయి. అయితే దుర్గా 9 రూపాలకు వాహనాలు భిన్నంగా ఉంటాయి. కానీ అన్నీ సింహం స్వరూపంగానే ఉంటాయి. దుర్గమాత వాహనం సింహం ఎలా అయ్యిందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..
పార్వతీ దేవికి శివునికి కోపం వచ్చినప్పుడు..
పురాణాల ప్రకారం.. పార్వతీ దేవి శివుడి అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేసింది. తపస్సు వల్ల పార్వతీమాత శరీర రంగు నల్లగా మారుతుంది. ఒకసారి పరమశివుడు పార్వతీమాతతో సరదాగా మాట్లాడుతుండగా, పార్వతిని కాళీ అని పిలిచాడు. దీంతో పార్వతి తల్లికి కోపం వచ్చి కైలాస పర్వతాన్ని వదిలి తపస్సు చేసింది.
పార్వతి దేవికి వరమిచ్చిన శివుడు..
పార్వతీ దేవి తపస్సులో మునిగి ఉండగా, ఒక సింహం తన వేట కోసం అక్కడికి వెళుతుంది. కానీ తపస్సులో మునిగి ఉన్న పార్వతీ దేవిని చూసి సింహం నిశ్శబ్దంగా అక్కడే కూర్చుంది. సింహం అక్కడే కూర్చుని పార్వతీ దేవి తపస్సు ఎప్పుడు ముగుస్తుందో అప్పుడే వేటకు వెళదామా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ తపస్సులో చాలా సంవత్సరాలు గడిచాయి. పరమశివుడు పార్వతీ దేవి కఠోర తపస్సుకు మెచ్చి ఆమెను గౌరీగా ఉండమని అనుగ్రహించాడు. ఆ తర్వాత, పార్వతీదేవి గంగా స్నానానికి వెళ్ళినప్పుడు, కౌశికి అని పిలువబడే ముదురు రంగు దేవత కనిపించి.. దేవిని మహాగౌరి అని పిలుస్తుంది.
సింహానికి వరమచ్చిన పార్వతీ దేవి
సింహం కూడా ఆకలితో, దాహంతో కూర్చోవడం పార్వతిదేవీ చూసింది. ఇది చూసిన పార్వతి మాత సింహానికి కూడా వరం ఇవ్వాలని భావించింది. దీంతో సింహాన్ని పార్వతీ దేవి తన వాహనంగా మారే అదృష్ట వరాన్ని అందిస్తుంది. దీని తరువాత దుర్గా మాతకు షెరావాలి అని పేరు పెట్టారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.