Train : గూడూరు జంక్షన్ సమీపంలో నవజీవన్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది.
అహ్మదాబాద్ నుంచి చెన్నై వస్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్లోని పాంట్రీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది.. గూడూరు రైల్వే స్టేషన్లో రైలు ఆపారు. వెంటనే మంటలను అదుపు చేశారు. బోగిలో మంటలు చేలరేగడం వల్ల గంటపాటు గూడూరు రైల్వే స్టేషన్లోనే రైలు నిలిచిపోయింది.
ఎవరికి గాయాలు కాలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. బోగిలో అగ్నిప్రమాదానికి కారణాలు వెల్లడించలేదు.