2 People Spot Dead in Warangal Road Accident: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు స్పాట్లో మృతి చెందారు. ఆత్మకూరు మండల గూడెప్పాడు వద్ద ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది.
ఈ ఘటనలో మూడునెలల పాపతోపాటు తల్లి మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వాళ్లని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటన విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితులు ఎక్కడివారు, ఎటు వైపు వెళ్తున్నారు అనే విషయాలపై దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి…
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ వద్ద రోడ్డు ప్రమాదం.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.
మూడు నెలల పాప, తల్లి ఇద్దరు మృతి.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు#RoadAccident #hanmakondadistrict #caraccident #todaynwesupdates… pic.twitter.com/jrQO7CFLMa
— BIG TV Breaking News (@bigtvtelugu) April 12, 2024