EPAPER

Manjummel Boys: హిట్ సినిమాకు తెలుగులో చిక్కులు.. మైత్రీ ఫైర్

Manjummel Boys: హిట్ సినిమాకు తెలుగులో చిక్కులు.. మైత్రీ ఫైర్

Manjummel Boys: ఈ మధ్యకాలంలో మలయాళ హిట్ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతునం విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రేమలు తెలుగులో రిలీజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మధ్యనే మంజుమ్మల్ బాయ్స్ కూడా తెలుగులో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే.


విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ కన్నా మంజుమ్మల్ బాయ్స్ నే ఎక్కువ కలక్షన్స్ రాబట్టింది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ లోపే ఈ సినిమా చిక్కుల్లో పడింది. అనూహ్యాంగా పీవీఆర్ మల్టిఫ్లెక్స్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను ఆపేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ వెల్లడించింది. ఇక తమ సినిమాను చెప్పాపెట్టకుండా థియేటర్ లో నిలిపివేయడంపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఫైర్ అయ్యాడు.

మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని, మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమని ఆయన తెలిపారు. అంతేకాకుండా షోస్ ను ఆపడం వలన తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ విషయమై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై ఈ రోజు సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.


Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×