Hepatitis Virus Kill 3,500 People a Day- WHO: ఇండియాలో హెపటైటిస్ బి,సి కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2022వ సంవత్సరంలో అత్యధిక హెపటైటిస్ (కాలేయ వాపు) కేసుల నమోదైన దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండవ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజా నివేదికలో వెల్లడించింది. కాలేయం ఇన్ ఫ్ల మేషన్ తలెత్తడం వల్ల హెపటైటిస్ అనే వ్యాధి వస్తుంది.
దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ వ్యాధి వల్ల మరణాలు కూడ సంభవించవచ్చు. ప్రంపంచ వ్యాప్తంగా 2022 లో 25. 4 కోట్ల మంది హెపటైటిస్-బితో, 5 కోట్ల మంది హెపటైటిస్-సితో బాధపడుతున్నారని తాజా నివేదికలో డబ్ల్యూహెచ్ వో తాజా నివేదికలో వెల్లడించింది.
Also Read: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ లీడర్ హనియే ముగ్గురు కుమారులు మృతి