ట్విటర్ వేదికగా IDF హనియే ముగ్గురు కుమారులు — అమీర్, హజెమ్, మహ్మద్ — సెంట్రల్ గాజా ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి వెళ్తున్నప్పుడు దాడి చేసినట్లు పేర్కొంది.
ఇస్మాయిల్ హనియే కూడా, అల్ జజీరా శాటిలైట్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన నలుగురు కుమారులలో ముగ్గురు “జెరూసలేం, అల్-అక్సా మసీదును విముక్తి చేసే మార్గంలో అమరులయ్యారు” అని చెప్పారు.
“శత్రువు ప్రతీకారం, హత్యాస్ఫూర్తితో నడుస్తాడు. ఎటువంటి ప్రమాణాలు లేదా చట్టాలకు విలువ ఇవ్వడు” అని అతను ఇంటర్వ్యూలో చెప్పారు.
Also Read: హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి.. వీడియో రిలీజ్
ఇస్మాయిల్ హనియే ఖతార్లో నివసిస్తున్నాడు. ఇజ్రాయెల్ వైమానిక దాడులు గాజా నగరంలోని షాతీ శరణార్థి శిబిరం సమీపంలో జరిగింది. కాగా హనియే గాజా ప్రాంతానికి చెందినవాడు.
IDF ప్రకారం, అమీర్ హనియే హమాస్ మిలిటరీ విభాగంలో స్క్వాడ్ కమాండర్, హజెమ్, మొహమ్మద్ హనియే కింది స్థాయి కార్యకర్తలు.
ఇంతలో, ఇజ్రాయెల్ డ్రోన్ లక్ష్యంగా చేసుకున్న ఒకే వాహనంలో సోదరులు కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్నారని హమాస్ అల్-అక్సా టీవీ స్టేషన్ పేర్కొంది. హజెమ్ హనియే కుమార్తె, అమీర్ కుమారుడు, కుమార్తెతో సహా మొత్తం ఆరుగురు మరణించారని టీవీ స్టేషన్ తెలిపింది.