South Africa, Zimbabwe and Namibia Hosting ODI World Cup 2027: ఎట్టకేలకు వన్డే ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీకి వేదికలు ఖరారైనట్లు తెలుస్తోంది. 2027 ఏడాది అక్టోబర్, నవంబరులో టోర్నీ మొదలుకానుంది. ఈ టోర్నమెంట్ ఆతిధ్యం ఈసారి ఆఫ్రికా ఖండానికి దక్కింది. సౌతాఫ్రికాతోపాటు జింబాబ్వే, నమీబియా వేదికలు కానున్నాయి. ప్రపంచకప్ కోసం మొత్తం 11 వేదికలుగా ఉండగా కేవలం ఎనిమిదింటిని మాత్రమే ఐసీసీ ఖరారు చేసినట్టు సమాచారం.
ముఖ్యంగా జోహన్నెస్బర్గ్- వాండర్స్, కేప్టౌన్- న్యూలాండ్స్, సెంచూరియన్- సూపర్స్పోర్ట్ పార్క్, డర్బన్ – కింగ్స్మీడ్, గ్కెబెర్హా- సెయింట్ జార్జ్ పార్క్, పార్ల్- బోలాండ్ పార్క్, బ్లూమ్ ఫోంటైన్- మాంగాంగ్ ఓవల్, తూర్పు సౌతాఫ్రికాలోని బఫెలోపార్క్ ప్రధాన వేదికలు కానున్నాయి.
మ్యాచ్ల డేట్స్ ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా క్రికెట్ గ్రౌండ్లకు సమీపంలో హోటళ్లు, ఎయిర్పోర్టు ఉండడంతో వీటిని పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక ఆతిధ్య దేశం నమీబియా మూడేళ్లపాటు జరగనున్న సీడబ్ల్యూసీ ఎలైట్లో ఆడాల్సివుంది. అందులో నాలుగు జట్లు అర్హత సాధిస్తాయి. వాటిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు నేరుగా ప్రపంచకప్లో ఆడనున్నాయి.
Also Read: Venkatesh Prasad’s World Cup Squad: వెంకటేశ్ ప్రసాద్ టీమ్ లో.. ఆ ముగ్గురు లేరు..!
🚨 REPORTS 🚨
According to reports Wanderers, Kingsmead, Newlands among eight South African venues for 2027 ODI World Cup has been confirmed.
South Africa, Zimbabwe & Namibia will be hosting the ICC ODI World Cup 2027.#ICC #ODI #WorldCup pic.twitter.com/t3fy3BjX8F
— Sportskeeda (@Sportskeeda) April 10, 2024