PV Sindhu and Prannoy in Asia Badminton Tourney: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో తొలిరోజు భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు విజయం సాధించింది. తొలి రౌండ్లో మలేషియాకు చెందిన జిన్ వీ పై 18-21, 21-14, 21-19 తేడాతో ఓడించింది. 12వ ర్యాంక్ క్రీడాకారిణికి ఓడించడానికి దాదాపు 64 నిమిషాలు పట్టింది.
ప్రత్యర్థిని లైట్గా పీవీ సింధు, తొలి రౌండ్లో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తర్వాత పుంజుకున్న సింధు.. రెండో రౌండ్లో విజయం సాధించింది. చివరి మ్యాచ్ ఇరువురు ఆటగాళ్లకు కీలకంగా మారింది. హోరాహోరీగా తలపడినప్పటికీ, చివరకు సింధు పైచేయి సాధించింది.
Also Read: ODI World Cup 2027: ఈసారి వాళ్లకే ఛాన్స్, ఆ సమయంలో మ్యాచ్లు..!
అటు పురుషుల సింగల్స్ విభాగంలో ప్రణయ్ తదుపరి రౌండ్కి దూసుకెళ్లాడు. చైనా క్రీడాకారుడు లు ఝుంగ్తో తలపడ్డాడు. తొలిసెట్ను పొగొట్టుకున్న ప్రణయ్, మిగతా రెండు సెట్లలో ఆదిపత్యం ప్రదర్శించాడు. అయినప్పటికీ అతి కష్టంమీద చెమటోడ్చి నెగ్గాడు. సింగల్స్ విభాగంలో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్లకు చుక్కెదురైంది.