SPF Constable Suicide in Vizag: విశాఖ సిటీలో దారుణం జరిగింది. డ్యూటీలో ఉన్న ఎప్పీఎఫ్ కానిస్టేబుల్ గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ద్వారకానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఐవోబీ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు శంకర్రావు.
గురువారం ఉదయం ఐదుగంటలకు డ్యూటీకి హాజరయ్యాడు. మరి ఏమైందో గానీ గన్ శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్లు పరుగులు తీశారు. స్థానికుల ద్వారా ఈ విషయం పోలీసు అధికారులకు తెలిసింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు అధికారులు. తన దగ్గరున్న గన్తో కాల్చుకుని మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.
శంకర్రావు డీటేల్స్ను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కానిస్టేబుల్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలోపడ్డారు పోలీసులు. ఆయన సెల్ఫోన్ ఆధారంగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: TDP Rebels : టిడిపికి రెబల్స్ కష్టాలు.. బుజ్జగింపులు ఫలిస్తాయా ?
శంకర్రావుకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేక ఫ్యామిలీ సమస్యలు కారణమా? అనే కోణం దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పోలీసులు డ్యూటీలో చనిపోయిన సందర్భాలు లేకపోలేదు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య…
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్ తో కాల్చుకొని ఆత్మహత్య
ఉదయం 5 గంటలకు డ్యూటీ కి హాజరైన శంకర్రావు
తన వద్ద ఉన్న గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణ
ఐఓబి బ్యాంకులో గన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావు… pic.twitter.com/zlkdwTwGxo
— BIG TV Breaking News (@bigtvtelugu) April 11, 2024