నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య ముంబై వాంఖేడీ స్టేడియంలో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య ఒక సారూప్యత ఉంది. అదేమిటంటే రెండు జట్లు కూడా ఒకొక్క మ్యాచ్ మాత్రమే ఇప్పటివరకు గెలిచాయి. ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్ లు ఆడి మూడు ఓడిపోయి, ఒకటి గెలిచింది. ఆర్సీబీ అయితే ఐదు మ్యాచ్ లు ఆడి 4 ఓడి, ఒకటి గెలిచింది.
ఇప్పుడు రెండు జట్లకి గెలవక తప్పని మ్యాచ్ ఇది…ఎందుకంటే ఇప్పటికే పాయింట్ల టేబుల్ లో రెండు జట్లు ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. 8వ స్థానంలో ముంబై ఉంటే, 9వ స్థానంలో ఆర్సీబీ ఉంది. ఓవరాల్ గా ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 34 మ్యాచ్ లు జరిగితే ముంబై 20 సార్లు గెలిస్తే, ఆర్సీబీ 14 సార్లు విజయం సాధించింది.
Also Read: ముంబైకి షాక్ మీద షాక్..
ఏదేమైనా ముంబై నుంచి రోహిత్ శర్మ ఆడాలి. అలాగే ఎన్నో అంచనాలతో వచ్చిన సూర్యకుమార్ తొలి మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఇప్పుడు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆడుదాం, చూద్దామంటే మ్యాచ్ లు లేవు. టేబుల్ లో టాప్ ఫోర్ ప్లేసెస్ ఫుల్ అయిపోతున్నాయి. వీరెక్కడో 8వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ నుంచి ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి ఈ మ్యాచ్ అగ్నిపరీక్షలా మారనుంది.
ఇక ఆర్సీబీ విషయానికి వస్తే, వీరి పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ విజయ్ మాల్యా చేతుల్లో ఉంది. కాకపోతే తను ఆర్థిక నేరాలకు పాల్పడటంతో దేశం దాటి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అది ఓనర్ లేకుండానే నడుస్తోంది. అందువల్లే వీళ్లిలా ఆడుతున్నారేమో తెలీదు. ప్రస్తుతం కొహ్లీ ఒక్కడే బండి లాగుతున్నాడు. ఈసారేం చేస్తాడో చూడాల్సిందే.