Kachchatheevu (Latest political news in India) : ప్రధాని మోదీ కచ్చతీవు వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించింది కాంగ్రెస్, డీఎంకే అని తమిళనాడులో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఖండించారు.
తమిళనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ.. కచ్చతీవు విషయంలో కాంగ్రెస్, డీఎంకే పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించి తమిళ జాలర్లు ఇబ్బందులు ఎదుర్కోవడానికి డీఎంకే, కాంగ్రెస్ పార్టీలే ప్రధాన కారణమని మోదీ ఆరోపించారు.
తమిళనాడు విషయంలో బీజేపీకి ఒక్కసీటు కూడా వచ్చే అవకాశం లేదని, అందుకే మోదీ ఇలా అసత్య ప్రచారాలకు తెరలేపారని జైరాం రమేష్ అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో సీట్ల కోసమే మోదీ, విదేశీ వ్యవహారాల మంతి కచ్చతీవు వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. వారు చెబుతున్నవన్నీ నిరాధార మైన వ్యాఖ్యలేనని కాంగ్రెస్ కొట్టిపారేసింది.
Also Read: ఇది జేమ్స్ బాండ్ సినిమా కాదు.. ఆ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం విళయతాండవం చేస్తోందని, నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నా సరే.. బీజేపీ వాటిని పట్టించుకోవడం లేదన్నారు. మన రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నా సరే.. ఇలాంటి విషయాలను పక్కన పెట్టి మోదీ ఇటువంటి అవాస్తవాల గురించే మాట్లాడుతున్నారని అన్నారు.