APPSC Group 2 Results: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. పరీక్ష రాసిన వారిలో మొత్తంగా 92,250 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్ కు అర్వత సాధించినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.
బుధవారం సాయంత్రం ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఫ్రిబవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా ఏపీపీఎస్సీ నిర్వహించింది. దాదాపు ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా హాజరవ్వగా.. 92,250 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. కాగా, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నట్లు గతంలో వెల్లడించింది.
రాష్ట్రంలో మొత్త 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి గాను 2023 డిసెంబర్ 21 నుంచి 2024 జనవరి 17 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఏపీపీఎస్సీ స్వీకరించింది. 92,250 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై కాగా.. వీరిలో 2,557 మందిని వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ అయిన అభ్యర్థుల లిస్ట్ ను కూడా ఏపీపీఎస్సీ తన వెబ్ సైట్ లో పొందుపరిచింది.