Niharika Konidela’s Committee Kurrallu: మెగా డాటర్ నిహారిక గుణదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ అంటే నిహారిక పేరే చెప్పుకోవచ్చు. ఒక మనసు సినిమాతో ఆమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించ లేనప్పటికీ నిహారికకు మంచి అవకాశాల్ని తీసుకొచ్చి పెట్టింది. కానీ ఆమెకు విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో ఆమె సినిమాలకు దూరమై పెద్దలు కుదిరించిన వివాహాన్ని చేసుకుంది.
చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం ఉదయపూర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే కొన్ని విభేదాలు వలన ఈ జంట మూడేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల అనంతరం నిహారిక మరోసారి తన సత్తా నిరూపించడానికి కష్టపడుతుంది. డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటిలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎంతో గ్రాండ్ గా జరిగాయి.
Also Read: The Goat Life: రూ.100 కోట్లు రాబట్టిన లేటెస్ట్ మూవీ.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఆహారం లేకుండా..!
యాదు వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కొత్త నటీనటులు పరిచయం కానున్నారు. తాజాగా నేడు ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కమిటీ కుర్రాళ్లు అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిపారు. గోదారి యాస, గోదారి ఎటకారమే కాదండి. గోదారి కుర్రోళ్లతో కూడా మామూలుగా ఉండదు మరి అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నిహారిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.