Mahesh Babu With Victory Venkatesh: ఈ మధ్య కాలంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడంతా ఐమాక్స్ లు, మల్టిఫ్లెక్స్ లు కాలం నడుస్తోంది. ఇక హైదరాబాద్ లో ఉన్న సింగిల్ స్క్రీన్స్ ను కూడా నిర్మాతలు వదలకుండా తీసుకొని వాటిని మల్టిఫ్లెక్స్ లు చేసేస్తున్నారు. ఈ మధ్య జగదాంబ థియేటర్ ను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
ఇక థియేటర్ల బిజినెస్ లో ఆరితేరిన హీరో అంటే మహేష్ బాబు అనే చెప్పాలి. హైదరాబాద్ లో AMB సినిమాస్ ను ఓపెన్ చేశాడు. అనంతరం అల్లు అర్జున్ సైతం AAA సినిమాస్ ను పఓపెన్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ థియేటర్ బిజినెస్ లోకి విక్టరీ వెంకటేష్ కూడా అడుగుపెట్టాడు. హైదరాబాద్ లో సుదర్శన్ థియేటర్ గురించి తెలియని వారుండరు. ఇప్పుడు ఆ థియేటర్ AMB విక్టరీ గా మారబోతుంది. 2010 లో ఈ థియేటర్ ను కొన్ని కారణాల వలన మూసివేసిన సంగతి తెల్సిందే.
Also Read: Devara: బ్రేకింగ్.. ధర్మ ప్రొడక్షన్స్ చేతికి దేవర
తాజాగా మహేష్- వెంకటేష్ కలిసి ఈ థియేటర్ ను మళ్లీ తిరిగి ప్రారంభించబోతున్నారు. ఏషియన్ సినిమాస్ తో కలిసి వీరు సుదర్శన్ థియేటర్ ను 7 స్క్రీన్స్ ఉండేలా నిర్మించబోతున్నారు. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. త్వరలోనే ఈ థియేటర్ కు మళ్లీ పూర్వ వైభవం రానుంది. ఇక ఎలాగైతేనేమి.. పెద్దోడును కూడా చిన్నోడు తన వైపు లాగేసుకున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ బిజినెస్ తో వెంకీ మామ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.