5 Crore Cash, 106 Kg Jewellery Seized in Karnataka During the Elections 2024: సార్వత్రిక ఎన్నికల వేళ ధన ప్రవాహం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం భారీగా పోలీసులు, ఫ్లయింగ్ స్వ్కాడ్లను నియమించినా డబ్బు పట్టుబడుతూనే ఉంది. తాజాగా కర్ణాటకలో దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు.
బళ్లారిలో స్థానిక హేమ జ్యూవెలర్స్ అధినేత నరేష్ సోనీ ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో నగదు, నగలు పట్టుబడ్డాయి. దాదాపు 106 కిలోల ఆభరణాలు ఉన్నాయి. అందులో మూడు కేజీల గోల్డ్, 103 కేజీల సిల్వర్ ఉంది. అలాగే 68 వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో వీటిని తీసుకొచ్చినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారి నరేష్ను అదుపులోకి తీసుకున్నారు.
పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న వేళ భారీగా నగదు, నగలు పట్టుబడడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి మరింత నిఘా పెంచారు. బోర్డర్లో బలగాలను మొహరించారు. కర్ణాటకకు రెండు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశ ఏప్రిల్ 26న కాగా, మే నాలుగున రెండో దశ పోలింగ్ జరగనుంది.
మరోవైపు కర్ణాటకలో సోదాలు ముమ్మరమయ్యాయి. కోలార్ పరిధిలోని ఓ కారులో భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. 1200 జిలెటిన్ స్టిక్స్, 7 బాక్సుల వైర్లు, 6 డిటోనేటర్లను ఓ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Karnataka | During a search operation, 1,200 Gelatin sticks, 7 boxes of wire, and 6 detonators were recovered from a person who was shifting explosives in a car in Nangali police station limits. One person has been detained: Kolar Police pic.twitter.com/6LznKQEDVv
— ANI (@ANI) April 8, 2024
Rs 5.60 crore cash, 3 kg gold, 103 kg silver jewellery, 68 silver bars reportedly seized by #Karnataka Police in #Ballari from the house of Hema Jewellers owner in Kambali Bazaar; Naresh Soni, owner of #HemaJewellers, reportedly taken into custody & being questioned #Election2024 pic.twitter.com/5kn2M5hOcw
— Avinash Pujari (@Avinashpujari02) April 8, 2024