BRS Ex MLA Shakeel Son Raheel Arrested on 2023 Accident case : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేసులో రహెల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.. కాగా, ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత షకీల్ తనయుడు దుబాయ్కు పారిపోయాడు. రహేల్ పై పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. యాక్సిడెంట్ తర్వాత సంఘటన స్థలం నుంచి తప్పించుకుని తన ప్లేస్ లో మరొక బాధ్యుడిగా చూపించాడు.
కాని పోలీసులు ఎట్టకేలకు అసలు నిందుతుడిని రహేల్ అని గుర్తించారు. ఈవ్యవహారంలో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై కూడా వేటు పడింది. అసలేం జరిగిందంటే.. 2023 డిసెంబర్ 23వ తేదీన తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ వద్ద ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారుతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ప్రజాభవన్ వద్ద బారికేడ్ల పైకి తొక్కుకుంటూ వెళ్లిపోయాడు.
కేసు నుంచి తప్పించుకోవడానికి తన ప్లేస్ లో మరొకరి బాధ్యుడిగా చూపించాడు. పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకోవడానికి నిందితుడు కావాలనే తప్పించుకున్నాడా లేక ఎవరైన తప్పించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టగా, ప్రజాభవన్ వద్ద సీసీటీవి ఫుటేజ్ పరిశీలించగా అసలు నిందితుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ అని తేల్చారు.. నేడు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోగానే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు రహేల్ ను అరెస్ట్ చేసారు.
Also Read: కవితకు బెయిల్ వచ్చేనా? నేతల్లో ఒకటే టెన్షన్..?