Gaza conflict: గాజా-ఇజ్రాయెల్ మధ్యం యుద్ధం మొదలై ఆదివారంతో ఆరు నెలలు పూర్తైంది. ఇప్పటి వరకూ ఈ దాడుల్లో దాదాపు 33వేలకు మందికి పైగా ప్రాణాలు విడిచారు. అయితే నేటికి ఆరు నెలలు పూర్తైన సందర్భంగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
గాజాతో కొనసాగుతున్న పోరులో తాము విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ కేబినేట్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విజయానికి అడుగు దూరంలో ఉన్నాం.. ఇప్పటి వరకు మనం చెల్లించిన మూల్యం ఎంతో బాధాకరమైంది, విచారకరం అని పేర్కొన్నారు.
తమ బంధీలను విడిచి పెట్చే వరకు సంధి ప్రసక్తే లేదని నెతన్యాహు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్యవర్తుల సహకారంతో కైరోలో తిరిగి ఇరుదేశాల మధ్య చర్చలు మొదలవుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశంగా మారాయి. తాము ఒప్పందానికి సిద్ధంగానే ఉన్నామని.. కానీ దాని అర్థం లొంగిపోవడానికి కాదన్నారు.
Also Read: చైనాకు భారీ షాక్ ఇచ్చిన జపాన్.. ఆకస్ కూటమితో ఒప్పందాలు షురూ..!
అంతర్జాతీయంగా తమ దేశంపై ఒత్తిడి తీసుకురాకుండా.. దాన్ని హమాస్ వైపు మళ్లిస్తే.. దాని ద్వారా తమ బంధీలు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. అయితే తమపై ఎవరైనా సరే దాడి చేయాలని ప్రయత్నించినా.. దాడి చేసినా సరే వారిపై ప్రతి దాడులు తప్పవని స్పష్టం చేశారు. తాము గత కొంత కాలంగా ఇదే నియమాన్ని పాటిస్తున్నామని.. ఇకపై కూడా ఇదే కొనసాగుతుందని తెలిపారు.